మహారాష్ట్రలో ఎంఐఎం నేత, మాలేగావ్ మాజీ మేయర్ అబ్దుల్ మాలిక్పై దుండగులు కాల్పులకు తెగపడిన ఘటనను ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. కుట్ర పూరితంగానే దాడి చేశారని ఆరోపించారు. సీఎం ఏక్నాథ్ షిండే, పోలీసులు నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ బిహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో ఎంఐఎం నాయకుడు అబ్దుల్ సలామ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.