తెలంగాణలో రుణ మాఫీ పేరుతో రైతులను మోసం చేసిన కాంగ్రెస్: ప్రధాని మోదీ

81பார்த்தது
తెలంగాణలో రుణ మాఫీ పేరుతో రైతులను మోసం చేసిన కాంగ్రెస్: ప్రధాని మోదీ
తెలంగాణలో రైతులకు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రైతులను మోసం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. దిక్కుతోచని స్ధితిలో తెలంగాణ రైతాంగం రుణ మాఫీ కోసం తిరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని వార్ధాలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే మోసపూరిత హామీలు, అసత్యాలేనని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీలో దేశభక్తి లోపించిందని అన్నారు.

தொடர்புடைய செய்தி