టాలీవుడ్ యువ నటులు చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్, కన్నడ నటుడు యుగంధర్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘యేవమ్’. నిర్మాణ సంస్థ సి-స్పేస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా మూవీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను జూన్ 14న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.