హైదరాబాద్ ఉప్పల్ లో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసింది. శాంతినగర్ లో బీఆర్ఎస్ నేత ఈగ సంతోష్, మరో ఏడుగురిపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులను సైతం తరిమారు. కాగా గాయపడిన వారు ప్రస్తుతం ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.