మహారాష్ట్రలోని భివాండీలో దారుణం చోటు చేసుకుంది. అక్కడి గోవింద్ నగర్ ప్రాంతంలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి.. అనంతరం హత్య చేశాడు. ఆ బాలికను తన ఇంటికి తీసుకెళ్లిన అభయ్ యాదవ్(40) అత్యాచారం చేశాడు. ఆ తర్వాత బాలిక గొంతు కోసి హత్యచేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. విషయం తెలిసిన భివాండీ పౌరులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.