భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. టీ20 వరల్డ్ కప్కు అతను అంబాసిడర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా యువీ ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ టీవీ షోలో పాల్గొన్నాడు. ‘అమెరికాలో క్రికెట్ ఆడతారని ఊహించలేదు. చాలా ఉత్సాహంగా ఉంది. ఐసీసీ కొత్త స్టేడియాలను నిర్మించింది’ అని తెలిపాడు. అమెరికన్లు తనను క్రికెట్ అంటే ఏమిటి? అని అడిగేవారని, అప్పుడు వాళ్లకు తాను బేస్బాల్ లాంటిదేనని వివరించేవాడినని చెప్పాడు.