ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా తమ ఉద్యోగులకు వేతన పెంపు ప్రకటించింది. 2023 డిసెంబర్ 31 కంటే ముందు సంస్థలో చేరినవారికి ఈ పెంపు వర్తిస్తుంది. దీని ప్రకారం.. ఫస్ట్ ఆఫీసర్, కెప్టెన్ల వేతనం నెలకు రూ.5 వేలు మేర పెరగనుంది. కమాండర్ల వేతనం రూ.11 వేలు, సీనియర్ కమాండర్ వేతనం రూ.15 వేలు చొప్పున పెరగనుంది. జూనియర్ ఫస్ట్ ఆఫీసర్కు ఎలాంటి పెంపూ చేపట్టలేదు. అలాగే బోనస్ కింద రూ.1.8 లక్షల వరకు చెల్లించనుంది.