ప్రేమించినవాడు మోసం చేయడంతో ఓ యువతి సూసైడ్ చేసుకుంది. జీడిమెట్ల ఎన్ఎల్బీనగర్లో ఉండే అఖిల(22)ను షాపూర్నగర్కి చెందిన అఖిల్ సాయిగౌడ్ గత కొన్నెళ్లుగా ప్రేమ పేరుతో వేధించాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో బంధువుల సమక్షంలో పిలిపించి మాట్లాడారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో ఒప్పుకున్నారు. కొన్నేళ్ల పాటు ప్రేమాయణం సాగించి కొద్ది నెలల నుంచి వేధించసాగాడు. పెళ్లికి కూడా నిరాకరించడంతో యువతి 14 పేజీల లేఖ రాసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.