ఢిల్లీలోని ఆజాద్ మార్కెట్ అండర్పాస్ వద్ద వర్షపునీటిలో ప్రైవేటు బస్సు నిలిచిపోయింది. వరద నీటిలో చిక్కుకున్న ప్రయాణికులను పోలీసులు ఎంతో ధైర్య, సాహసాలు ప్రదర్శించి కాపాడారు. సురక్షితంగా తీసుకొచ్చారు. తాడు సాహాయంతో పోలీసులు ఈదుకుంటూ వెళ్లి వారిని తీసుకొచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.