దుబాయ్ డ్యూటీ-ఫ్రీ (DDF) మిలీనియం మిలియనీర్ డ్రాలో ఓ భారతీయుడు లాటరీ గెలుచుకున్నాడు. చీమలకొండ కృష్ణ అనే వ్యక్తి మే 8న ఆన్లైన్లో టికెట్ నంబర్ 1795ను కొనుగోలు చేశాడు. డ్రాలో ఆ టికెట్ రావడంతో అతడికి ఒక మిలియన్ డాలర్లు (రూ. 8,33,61,400) గెలుచుకున్నాడు. 1999లో మిలీనియం మిలియనీర్ షో ప్రారంభించినప్పటి నుంచి ఒక మిలియన్ డాలర్లు గెలుచుకున్న 230వ భారతీయుడు కృష్ణ. దీంతో కృష్ణ సంతోషంలో మునిగిపోయాడు.