వచ్చే ఆరు మాసాల్లో రూ.280 కోట్ల నిధులు సమీకరించనున్నామని రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్షర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వైఆర్ నాగరాజు తెలిపారు. బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ చీఫ్ ఫైనాన్సీయల్ ఆఫీసర్ ఎన్ఎస్ రావుతో కలిసి రాంకీ ఇన్ఫ్రా ఆర్థిక ఫలితాలను వెల్లడించారు. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో కంపెనీ నికర లాభాలు 94.67 శాతం తగ్గి రూ.57.5 కోట్లుగా నమోదయ్యాయని ఎన్ఎస్ రావు తెలిపారు.