తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో BRS అత్యధిక స్థానాల్లో గెలుపొందుతుందని సీపాక్ ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైంది. కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక ఓట్లు కలిసిరావడంతో BRS భారీ విజయం సాధిస్తుందని సీపాక్ తన సర్వేలో తెలిపింది. బీఆర్ఎస్కు 11 సీట్లు, బీజేపీకి 2, కాంగ్రెస్కు ఒక స్థానం, ఎంఐఎంకు ఒక స్థానంలో గెలుస్తుందని వెల్లడించింది. రెండు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని పేర్కొంది.