మృతుల కుటుంబాలకు ప్రభుత్వ విప్ పరామర్శ
బుగ్గరాం మండలలో గోపాలాపూర్ గ్రామంలో గురువారం హత్యకు గురై మరణించిన శ్రీనివాస్, మహేష్ కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్, ధర్మపురి శాసన శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి వెంట జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్, ఉపాధ్యక్షులు నగునూరి నర్సాగౌడ్, తదితరులు ఉన్నారు.