నూతన ప్రిన్సిపల్ కు ఘన స్వాగతం

59பார்த்தது
నూతన ప్రిన్సిపల్ కు ఘన స్వాగతం
ధర్మారం మండలం మల్లాపూర్ గురుకుల విద్యాలయ నూతన ప్రిన్సిపల్ దేవసేనకు పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెకు మొక్కను అందజేశారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణలో ప్రిన్సిపల్ మొక్కలు నాటారు. వైస్ ప్రిన్సిపల్ మాధవి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ సుంచు మల్లేశం, వైస్ చైర్మన్ సిపెళ్లి గోపాలకృష్ణ, మాచర్ల కొమరయ్య, నలిగంటి నరేష్, దాసరి స్వామి విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி