రామాలయంలో ఏకాదశి సందర్భంగా పూజలు

84பார்த்தது
తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామంలోని స్థానిక శ్రీ కోదండ రామాలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాములకు అభిషేకం, సహస్ర పూజ, అర్చన కార్యక్రమాలు జరిపించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు బండవరం శ్రీకాంత్, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி