ధర్మపురిలో మాజీ మంత్రి పూజలు

78பார்த்தது
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని తెలంగాణ రాష్ట్ర మాజీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సతీసమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి దేవస్థానం సాంప్రదాయ ప్రకారం ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామివారి చిత్రపటం, శేష వస్త్ర ప్రసాదం అందజేసి శాలువాతో సన్మానించారు.

தொடர்புடைய செய்தி