AP: రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా నిర్మిస్తున్నారంటూ 10 వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడం, కొన్నిచోట్ల కూల్చేయడాన్ని పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్పై హైకోర్టు స్టేటస్కో విధించింది. రేపు ఈ పిటిషన్పై విచారిస్తామని అప్పటివరకు స్టేటస్కో కొనసాగుతుందని న్యాయస్థానం పేర్కొంది.