కల్తీ నెయ్యిపై రాజకీయ దుమారం.. ఏపీ హైకోర్టులో వైసీపీ ఎంపీ పిటిషన్

65பார்த்தது
కల్తీ నెయ్యిపై రాజకీయ దుమారం.. ఏపీ హైకోర్టులో వైసీపీ ఎంపీ పిటిషన్
శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై రాజకీయ దుమారం రేపుతోంది. దీనిపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విజిలెన్స్ నివేదిక నిలుపుదల చేయాలని పిటిషన్‌లో కోరారు. వివరణ ఇచ్చేందుకు కొన్ని రికార్డ్స్ ఇవ్వాలని కోరినా స్పందించడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆరోపణపై ప్రమాణం చేసి సాక్ష్యాలతో నిరూపించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி