ఇసుకను సామాన్యులకు అందుబాటులోకి తేవాలి: సిపిఎం

66பார்த்தது
ఇసుకను సామాన్యులకు అందుబాటులోకి తేవాలి: సిపిఎం
ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఉచిత ఇసుక విధానాన్ని సామాన్యులకు అందుబాటులోకి తేవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం కాకుమాను తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. సిపిఎం నాయకులు దొప్పలపూడి రమేష్ బాబు, కొత్త వెంకటశివరావు మాట్లాడుతూ అధికారంలోకొచ్చి 4నెలలు అయినా ఇసుక విధానంపై సరైన అవగాహన లేదని పేర్కొన్నారు. కార్యాలయంలో ఆర్ఐ కు వినతిపత్రం అందించారు.

தொடர்புடைய செய்தி