రాష్ట్రంలో ఎవరూ చెత్త పన్ను కట్టాల్సిన పనిలేదు: ఎమ్మెల్యే

83பார்த்தது
రాష్ట్రంలో ఎవరూ చెత్త పన్ను కట్టాల్సిన పనిలేదు: ఎమ్మెల్యే
రాష్ట్రంలో ఇకపై ఎవరూ చెత్తపన్ను కట్టాల్సిన పనిలేదని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్ఎస్పీ కాలనీ ఆవరణలోని సాయిబాబా దేవస్థానం వద్ద బుధవారం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా స్వయంగా ఆయన చీరుపుపట్టి ఊడ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్ల జగన్ పాలనలో స్వచ్ఛతను అటకెక్కించారని, పంచాయతీల్లో రూ.10వేల కోట్లు దారి మళ్లించారని విమర్శించారు.

தொடர்புடைய செய்தி