ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

67பார்த்தது
ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
పేకాట స్థానంపై నిజాంపట్నం పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఆదివారం నిజాంపట్నం బీచ్ రోడ్ లో కోతముక్క పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఎస్ఐ తిరుపతిరావు సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 21, 290 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని ఎస్సై తిరుపతిరావు తెలిపారు.

தொடர்புடைய செய்தி