జీతాలు పెంచకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం: వాలంటీర్లు

74பார்த்தது
గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి చైతన్య మాట్లాడుతూ.. చంద్రబాబు ఇచ్చిన హామీలకు అనుగుణంగా వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రూ. 10వేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వలీ మాట్లాడుతూ.. వాలంటీర్లకు న్యాయం చేయని పక్షంలో సీఎం ఇంటిని ముట్టడిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி