తుళ్ళూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

64பார்த்தது
తుళ్ళూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
తుళ్ళూరు మండలంలోని రాయపూడి వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. లింగాయపాలెం గ్రామానికి చెందిన నూతక్కి రామారావు (45) బైకుపై రాయపూడి వైపు వస్తుండగా, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామారావు అక్కడికక్కడే మృతి చెందాడు. తుళ్లూరు ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி