రిక్షాపై నిద్రిస్తున్న వ్యక్తి జేబులోంచి డబ్బులు కొట్టేసిన యువకుడు (వీడియో)

601பார்த்தது
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఇళ్లలోపల నుంచి ఫుట్ పాత్ వరకు నిద్రిస్తున్న వారి వద్ద ఉన్న డబ్బు, మొబైల్ ఫోన్లతో దొంగలు పరారీ అవుతున్నారు. అయితే తాజాగా ఫుట్ పాత్ వద్ద రిక్షాపై నిద్రిస్తున్న వ్యక్తి నుంచి ఓ యువకుడు డబ్బులు దోచుకున్నాడు. అనంతరం పక్కనే ఉన్న వ్యక్తి దగ్గర కూడా దోచుకోవడానికి యత్నించగా.. అతను నిద్ర మేలుకోవడంతో నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி