ఉచితంగా ఇసుక తీసుకెళ్లొచ్చు: సీఎం చంద్రబాబు

57பார்த்தது
ఉచితంగా ఇసుక తీసుకెళ్లొచ్చు: సీఎం చంద్రబాబు
ఏపీలో ఉచిత ఇసుక విషయంలో కూటమి ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటే ఎవరినీ వదిలిపెట్టేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇసుక ఉచితంగానే తీసుకెళ్లాలి. ఎడ్ల బండి ద్వారా ఎవరైనా ఇసుకను తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. వారిపై కేసులు పెడితే అధికారులను సస్పెండ్ చేస్తాం. దీనిలో ఎవరి పెత్తనాన్నీ సహించం. ఎవరి ఊరిలో వాళ్లకు ఇసుక తీసుకెళ్లే స్వేచ్ఛ వారికి ఉంటుంది. ఇందులో ఎవరి ప్రమేయం అక్కర్లేదని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி