శాస్త్రోక్తంగా యాదాద్రి శ్రీవారికి నిత్య కళ్యాణం

56பார்த்தது
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నిత్య కళ్యాణాన్ని అర్చకులు ఆదివారం శాస్త్రోక్తంగా జరిపించారు. ఉదయం స్వామి వారికి సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి ఆగమశాస్త్రానుసారం కల్యాణోత్సవం జరిపించారు. సుమారు రెండు గంటల పాటు సాగిన వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

தொடர்புடைய செய்தி