పాములు ఆడించే వ్యక్తిపై కేసు

51பார்த்தது
పాములు ఆడించే వ్యక్తిపై కేసు
పాములు ఆడిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు శుక్రవారం అటవీ రేంజ్ అధికారి సందీప్ తెలిపారు. రాయపర్తి మండలం సన్నూర్ కు చెందిన యాకూబ్ వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. కోరలు తొలగించిన రెండు నాగుపాములను కలిగి ఉన్నాడు. వరంగల్ పాత బస్టాండు వద్ద పాములను ఆడిస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. అతడిని అదుపులోకి తీసుకుని, పాములను స్వాధీనం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி