వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ముంపుకు గురైన ఎన్ ఎన్ నగర్, డీకే నగర్, మైసయ్య నగర్, బాధితులకు నిత్యవసర వస్తువుల సరుకులతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. వరదల కారణంగా ముంపుకు గురైన బాధితులకు తాత్కాలిక ఉపశమనం చేకూర్చే కార్యక్రమాలు కాకుండా వరదలు రాకుండా నిపుణులతో సర్వే నిర్వహించి శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు.