జనగామ జిల్లా రఘునాథపల్లి మండల సర్వసభ్య సమావేశం ఈ 30న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎంపీడీవో గార్లపాటి శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు మండల కేంద్రంలోని ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో సమావేశం ఉంటుందన్నారు. సమావేశానికి ప్రజాప్రతినిధులు ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు హాజరుకావాలని కోరారు. పాలకవర్గానికి ఇదే చివరి సమావేశం కానుంది.