వృద్ధురాలిని ఢీకొన్న అడిషనల్ కలెక్టర్ వాహనం

81பார்த்தது
జనగామ జిల్లాలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న వృద్దురాలని సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో వృద్ధురాలికి చేయి విరిగి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెంకు చెందిన గంగారపు పద్మ అనే వృద్ధురాలు రోడ్డు దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 108 వాహనంలో చికిత్స కోసం ఎంజిఎంకు తరలించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

தொடர்புடைய செய்தி