రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలకు విద్యార్థి ఎంపిక

54பார்த்தது
రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలకు విద్యార్థి ఎంపిక
మహబూబాబాద్ జిల్లా తోర్రూర్ జెడ్పీహెచ్ఎస్ లో 11వ తేదీన జరిగిన జిల్లా స్థాయి ఫుట్బాల్ పోటీల్లో పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. అందులో అత్యంత ప్రతిభ కనబరచి 21 నుండి 23తేదీ వరకు తొర్రుర్ ఆర్యభట్ట పాఠశాల ఆవరణలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థి ఎండీ. ఇర్ఫాన్ అండర్ -17 కేటగిరీలో ఎంపికయ్యాడని పాఠశాల హెచ్ఎం రమాదేవి తెలిపారు. విద్యార్థికి ప్రతేకంగా హెచ్ఎం షూ ని బహుకరించి అభినందనలు తెలిపారు. అలాగే పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు విద్యార్ధికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అశోక్, మదన్, చిన్నపురెడ్డి, మూర్తి, పరమేశ్వరి, మంజుల, శ్రీనివాస్, కుమారస్వామి, పీఈటీ అనిల్, విద్యార్థులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி