శనివారం నుండి బోగత జలపాతం సందర్శన షురూ..

75பார்த்தது
పర్యాటకులకు ములుగు అటవీశాఖ అధికారులు శుభవార్త చెప్పారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బోగత జలపాతం సందర్శనను శనివారం నుండి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇటీవల భారీ వర్షాలు వరదల కారణంగా బోగత సందర్శన నిలిపివేశారు. జలపాతంలో వరద తగ్గుముఖం పట్టడంతో తిరిగి సందర్శన ప్రారంభిస్తున్నామన్నారు. కానీ కొలనులోకి దిగడం నిషేధమన్నారు. అటవీశాఖ సిబ్బందికి పర్యటకులు సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி