ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో గోదావరి పరివాహక ప్రాంతాలను మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ శుక్రవారం పరిశీలించారు. గోదావరి ఒడ్డున కోతకు గురవుతున్న భూములకు నష్టపరిహారం అందించాలని సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని, అకాల వర్షాల వల్ల పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందజేసి అండగా ఉంటామని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.