కుక్కల దాడిలో బాలుడికి గాయాలు

53பார்த்தது
కుక్కల దాడిలో బాలుడికి గాయాలు
ములుగు జిల్లా తాడ్వాయి గ్రామ పంచాయతీ పరిధిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాడ్వాయి గ్రామ పంచాయతీ పరిధి నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బాలుడితో పాటు మరో ఇద్దరిపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడి కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. గ్రామపంచాయతీ అధికారులు స్పందించి కుక్కల బెడద నుండి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி