వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు

73பார்த்தது
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం తోపనపల్లి వద్ద వరదనీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. వరంగల్ - మహబూబాబాద్ రహదారి వద్ద తోపనపల్లి చెరువు ఒక్కసారిగా పొంగడంతో కట్టపై వరద నీటిలో నిలిచిపోయింది. శనివారం రాత్రంతా బస్సులోనే ప్రయాణికులు ఉన్నారు. తమను కాపాడాలంటూ ప్రయాణికులు బంధువులకు అధికారులకు సమాచారం అందించారు. వరద నీరు ముంచెత్తడంతో ఎటు వెళ్లలేని స్థితిలో ప్రయాణికులు ఆర్టీసీ బస్సులోనే ఉన్నారు.

தொடர்புடைய செய்தி