ముల్కలపల్లి పాఠశాలలో గౌతమ బుద్ధుడి విగ్రహం ఆవిష్కరణ

51பார்த்தது
డోర్నకల్ మండలం ముల్కలపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శనివారం గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని రిబ్బన్ కట్ చేసి ఆవిష్కరించారు. విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ విగ్రహాన్ని 2009-2010 బ్యాచ్ పూర్వ విద్యార్థిని కల్పన బహుకరించారు. ఆ విద్యార్థినిని ఉపాధ్యాయులందరు కలిసి ఘనంగా సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రుక్మాంగధర రావు, అమ్మ ఆదర్శ కమిటి అధ్యక్షురాలు స్వప్న, పూర్వ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி