క్రూరమృగాల దాడిలో ఇద్దరు చిన్నారుల మృతి

58பார்த்தது
క్రూరమృగాల దాడిలో ఇద్దరు చిన్నారుల మృతి
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో వన్యప్రాణుల దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు వెల్లడించారు. శనివారం సాయంత్రం గంగాబెహర్ గ్రామానికి చెందిన సాజేబ్ (12) సైకిల్‌పై వెళుతుండగా, అడవి జంతువు బాలుడిపై దాడి చేసి చంపేసింది. మరో ఘటనలో ఇదే జిల్లాలోని కుర్తైహా గ్రామంలోని ఓ ఇంట్లోకి చిరుత పులి చొరబడి రిజా బానో(3) అనే చిన్నారిని ఎత్తుకెళ్లినట్లు స్థానికులు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி