TG: సూర్యాపేట జిల్లాలో ఐదు రోజులపాటు పెద్దగట్టు లింగమంతుల జాతర జరగనుంది. ఈ జాతరకు 25 లక్షల మంది భక్తులు హాజరవుతారనిన అధికారులు అంచనా వేస్తున్నారు. జాతర నేపథ్యంలో విజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను.. నార్కెట్పల్లి, నల్గొండ, కోదాడ మీదుగా మళ్లించారు. రెండు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు వర్తించనున్నట్లు వారు వెల్లడించారు.