AP: ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణానికి వచ్చే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శుక్రవారం జరిగే స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు అందించనున్నారు. ఈ మేరకు తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 2లో శ్రీవారి సేవకుల సహకారంతో లడ్డూల ప్యాకింగ్ నిర్వహించారు. సుమారు 70 వేల లడ్డూ ప్రసాదాలను అందించనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.