చంచల్గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా అక్కడ ఇళ్లు కోల్పోయిన బాధితులకు చంచల్గూడలో డబుల్ బెడ్ రూమ్లను ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీంతో ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ల పథకం కోసం దరఖాస్తు చేసుకున్న చంచల్గూడలో గొడవకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.