జాతీయ రహదారిపై కారు బోల్తా.. ప్రయాణికులకు స్వల్ప గాయాలు

85பார்த்தது
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం శివార్లలో జాతీయ రహదారిపై హైదరాబాదు నుండి విజయవాడ వెళుతున్న కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారు ధ్వంసం కాగా, కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా ప్రమాదం జరిగిన సమయంలో జర్నలిస్టు మల్లికార్జున్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు శేఖర్ స్పందించి క్షతగాత్రులకు సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

தொடர்புடைய செய்தி