వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్డు శుక్రవారం చిత్తడిగా మారి దర్శనమిస్తోంది. దీంతో విద్యార్థులు నడిచేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే చిత్తడిగా, బురదమయంగా మారిన రోడ్డును సంబంధిత అధికారులు వెంటనే బాగు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. రెండు, మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే గ్రౌండ్ జలమయంగా మారింది.