కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివి: కలెక్టర్

73பார்த்தது
కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా కలెక్టరేట్ సముదాయంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్  హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కాళోజీ చిత్ర పటానికి కలెక్టర్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

தொடர்புடைய செய்தி