నిర్ణీత సమయానికి విగ్రహాలను తరలించాలి: కలెక్టర్, ఎస్పి

55பார்த்தது
నిర్ణీత సమయానికి విగ్రహాలను తరలించాలి: కలెక్టర్, ఎస్పి
వినాయక మండపాల నిర్వాహకులు నిర్ణీత సమయానికి విగ్రహాలను తరలించాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఈ నెల 17న మంగళవారం వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ పలు శాఖల అధికారులు సోమవారం పరిశీలించారు. వినాయక మంటపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తిశ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி