మహిళల భద్రతే షీ టీం లక్ష్యం: పోలీస్ కమిషనర్

62பார்த்தது
మహిళల భద్రతే షీ టీం లక్ష్యం: పోలీస్ కమిషనర్
మహిళల భద్రతే షీ టీం ప్రధాన లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనరేట్ పరిధిలో రెండు షీ టీం బృందాలు పని చేస్తున్నాయని, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో, టి సేఫ్ అప్, డ్రగ్స్, బాల్య వివాహాలు, వరకట్నం చట్టాలపై, నూతన మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితిలో షీ టీం నెంబర్ 6303923700 ద్వారా లేదా డయల్ 100 ద్వారా తక్షణ సహాయం పొందాలన్నారు.

தொடர்புடைய செய்தி