రామగుండం: ఆర్జీ- 3 ఏరియాలో వాల్మీకి జయంతి

55பார்த்தது
రామగుండం: ఆర్జీ- 3 ఏరియాలో వాల్మీకి జయంతి
సింగరేణి సంస్థ రామగుండం- 3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను గురువారం జీఎం కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఏరియా జీఎం సుధాకరరావు వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు సంతోష్, కోట రవీందర్ రెడ్డి, అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి గ్రంధి శ్రీనివాసరావు, ఎస్ ఓ టు జీఎం రఘుపతి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி