సకాలంలో పెండింగ్ భూ సమస్యలు పరిష్కరించాలి

67பார்த்தது
సకాలంలో పెండింగ్ భూ సమస్యలు పరిష్కరించాలి
పెండింగ్ భూ సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ఆదేశించారు. గురువారం కాల్వశ్రీరాంపూర్ తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండలంలో పెండింగ్ ధరణి సమస్యలు, భూసేకరణ, వివిధ సర్టిఫికెట్ల జారీపై సమీక్ష నిర్వహించారు. మీసేవ కేంద్రాల ద్వారా సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిశీలించి జారీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో తహసిల్దార్ వకీల్, అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி