మంథని మున్సిపల్ పరిధిలోని కూచిరాజ్పల్లి గ్రామ శివారులో ఉన్న తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలను ఆర్డీవో హనుమానాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలోని రికార్డులను పరిశీలించడంతో పాటు విద్యార్థులకు అందజేస్తున్న భోజనం, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పాఠశాల ఆవరణతో పాటు మూత్ర శాలలను పరిశుభ్రంగా ఉంచాలని పాఠశాలకు సిబ్బందికి సూచించారు.