కమాన్ పూర్: ఆదివరహా స్వామి హుండీ ఆదాయం రూ. 7, 29, 879

65பார்த்தது
కమాన్ పూర్: ఆదివరహా స్వామి హుండీ ఆదాయం రూ. 7, 29, 879
కమాన్ పూర్ లోని సుప్రసిద్ధ శ్రీ ఆది వరహాస్వామి ఆలయ హుండీ ఆదాయం 7, 29, 879 రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈవో కాంత రెడ్డి తెలిపారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపును జరిపారు. గత మూడు నెలలకు హుండీ లెక్కింపు నిర్వహించడం జరుగుతుంది. ఈ లెక్కింపులో తహసీల్దార్ వాసంతి, ఆలయ ప్రధానాచార్యులు వరప్రసాద్, పరిశీలకులు శ్రీనివాస్, సిబ్బంది సంతు, మల్లేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி