పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గడ్డి వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం పట్టణంలోని తెనుగు వాడలో ప్రత్యేక గడ్డితో తయారు చేసిన వినాయకుడిని ఏర్పాటు చేయడం ఆనవాయితీ. గడ్డి వినాయకుడిని తిలకించేందుకు పరిసర ప్రాంత భక్తులు ఆసక్తి కనబరిచారు.